30, మార్చి 2026, సోమవారం

Telugu కథా చరిత్రన

 కథ మేరంగి సంస్థానానికి చెందిన ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ (1864-1933) రాసిన "లలిత" (1903) అని ఒక అభిప్రాయం ఉంది. డా. భార్గవీరావు సంకలనం చేసిన "నూరేళ్ళ పంట"లో భండారు అచ్చమాంబ (1874-1904) రాసిన "స్త్రీవిద్య" మొదటి కథగా ముందుకు వచ్చింది. అలాగే మాడపాటి హనుమంతరావు (1885-1970) కథలు "మల్లికా గుచ్ఛము" పేరిట 1915లో ప్రచురితమయ్యాయి. కాని తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు (1862-1915). గురజాడ వ్రాసినవి ఐదు కథలు, ఒక నవలకి స్కెచ్. శిల్పరీత్యా సన్నివేశ ప్రధానంగా "దిద్దుబాటు" అనే కథ, మౌఖిక సంప్రదాయ కథన రీతిలో "మీ పేరేమిటి" అనే కథ ఉన్నాయి. ఇవి రెండూ ఒకే సంవత్సరంలో ప్రచురణకు వచ్చినందున ఈ రెంటినీ మొదటి కథలుగా గుర్తించవచ్చును.[3]


h1ఈ శతాబ్దపు కథా చరిత్రను మూడు దశలుగా విభజించవచ్చును.


1880-1930 మధ్యకాలం

ఈ ప్రారంభదశలో కథకులు ప్రధానంగా సంస్కరణవాదులు. మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితుల చిత్రణ మొదలైన విషయాల దృష్టి సారించింది. కథలోని వాతావరణం మధ్యతరగతి సంస్కృతి, సంప్రదాయాలతో నిండివుంటుంది. ఈ దశలో వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చింతా దీక్షితులు, చలం, మునిమాణిక్యం, మొక్కపాటి నరసింహశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, భమిడిపాటి కామేశ్వరరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి వంటి రచయితలు ప్రముఖులు. వాడుక భాష కథల భాష అయింది.


1930-1970 మధ్యకాలం

ఈ దశ తెలుగు కథకు మహర్దశ అని చెప్పవచ్చును. ఈ రెండవదశలో అభ్యుదయవాదులు, తాత్వికులు, కళాప్రియులు కథకులుగా కనిపిస్తారు. అక్రమాలతో రాజీపడలేని అభ్యుదయ దృక్పథంగల యువకులు కథారచయితలుగా ప్రజాజీవితానికి సన్నిహితులయ్యారు. వాస్తవికతకు భంగం కలగకుండా జీవితసత్యాన్ని నిరూపిస్తూ కథాశిల్పాన్ని పోషించడం వీరి లక్ష్యం. పండితులు, పరిశోధకులు, కళాకారులవంటివారు కథారంగం నుంచి నిష్క్రమించారు. పూర్తిగా మాండలిక శైలిలో కథలు రాయడం ఈ దశలో మొదలైంది. కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, బలివాడ కాంతారావు, బుచ్చిబాబు, మధురాంతకం రాజారాం, కొమ్మూరి వేణుగోపాలరావు, శీలా వీర్రాజు, మంజుశ్రీ, హితశ్రీ, వాకాటి పాండురంగారావు, ముళ్ళపూడి వెంకటరమణ మొదలైనవారు కథాక్షేత్రంలో బంగారు పంటలు పండించారు. ఉత్తరాంధ్ర కథకత్రయం చాసో, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు ఈ దశలో కథారచనకు ఈ దశలో దిక్సూచులుగా నిలబడ్డారు.


ఈ దశ చివరభాగంలో మహిళా రచయితలు తెలుగు కథకు ప్రతిష్ఠతెచ్చారు. వీరిలో రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి, లత, యద్దనపూడి సులోచనారాణి, రామలక్ష్మి, భానుమతి, మాలతీ చందూర్ వంటి వారెందరో మంచి కథలు రాశారు.


1970 తర్వాతకాలం

మూడవదశలో విప్లవవాదం తత్సంబంధ అంశాలు ప్రధాన లక్షణాలు. విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావం దీనికి దోహదం చేసింది. కొండగాలి, ఇప్పుడు వీస్తున్న గాలి, కొలిమంటుకొంది వంటి కథా సంపుటాలు ఈ భావజాలాన్ని వ్యాప్తిచేశాయి. శ్రీకాకుళ పోరాటంతో రాజుకున్న ఈ నిప్పు తెలంగాణాకు వ్యాపించి అల్లం రాజయ్య, కాలువ మల్లయ్య వంటి కథకులెందరో ఈ దిశలో రచనలు చేశారు. రాయలసీమ కథ ముందంజవేసింది. దళితవాదులు, స్త్రీవాదులు, మైనారిటీవాదులూ తమ కలంపోరుకు కథను ఆయుధంగా ఎంచుకున్నారు.


మహిళా రచయితలలో ముదిగంటి సుజాతారెడ్డి, ఓల్గా, కుప్పిలి పద్మ వంటి వారు పోరాటపటిమ కలిగిన రచనలు చేస్తున్నారు. చాగంటి తులసి వంటివారు హిందీ, ఒరియా భాషల నుండి అనువాదాలు చేస్తున్నారు.

h1

CONCEPT భావన : P2తెలుగు సాహిత్యం యుగ విభజన

CONCEPT భావన : P2తెలుగు సాహిత్యం యుగ విభజన : తెలుగు సాహిత్యం యుగ విభజన తెలుగు సాహిత్యాన్ని అధ్యయన సౌలభ్యం కోసం పండితులు అనేక యుగాలుగా...