30, మార్చి 2026, సోమవారం

భట్టిప్రోలు లిపి

 


భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని పాకృత శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )

తెలుగు దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.[2][3] స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,.[4] భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.[5][6]


శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు.[7] భట్టిప్రోలు స్తూపంలో దొరికిన స్పటికపు బరిణెల మీదనున్న అక్షరాలలో కొన్ని అచ్చతెలుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. వాటిలో ఇప్పటి తెలుగు ‘ళ’ అక్షరం భట్టిప్రోలు అక్షరానికి పరిణామమే. అలాగే ద అనే అక్షరము. హల్లుల పైన ఉండే తలకట్టుకు మూలమైన గీత భట్టిప్రోలు శాసనం నాటి లిపిలో కనబడుతుంది.[1]

CONCEPT భావన : P2తెలుగు సాహిత్యం యుగ విభజన

CONCEPT భావన : P2తెలుగు సాహిత్యం యుగ విభజన : తెలుగు సాహిత్యం యుగ విభజన తెలుగు సాహిత్యాన్ని అధ్యయన సౌలభ్యం కోసం పండితులు అనేక యుగాలుగా...